Tuesday, May 21, 2024
- Advertisement -

అన్నీ బంద్ : బాబుకు జై కొట్టే చానళ్ల కే ఏపీలో పర్మిట్!

- Advertisement -

ఉదయం లేస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నీతులు చెబుతూ ఉంటారు. తాను నిప్పు అని.. తమ విధానాలు చాలా గొప్పగా ఉంటాయని బాబు గారు సెలవిస్తూ ఉంటారు.మరి ఆయన ఇలా మాట్లాడుతుంటారు కానీ. .వాస్తవంలో మాత్రం చాలా దారుణాలే జరుగుతున్నాయి.

ఏపీలో మీడియాపై ఇప్పుడు తీవ్రమైన ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం వాళ్లు అన్ని చానళ్లనూ బంద్ చేయించేస్తున్నారు. తమకు వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే అవకాశం ఉన్న వాటన్నింటినీ వారు మూసేయిస్తున్నారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తమ తమ నియోజకవర్గాల స్థాయిల్లో జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సాక్షి చానల్ ను బంద్ చేయిస్తున్నారు. ఈచానల్ లో తమకు వ్యతిరేక వార్తలు ప్రసారం అవుతాయని అంటూ వారు చానల్ ను ఆపిస్తున్నారు. మరి సాక్షి విషయంలోనే అనుకొంటే.. ఇప్పుడు తెలుగుదేశం నేతలు మరో అడుగు ముందుకేసి ఇతర చానళ్లపై కూడా పంజావిసురుతున్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీవీ, టీవీ 5 వంటి చానళ్లను కూడా ఆపిస్తున్నారు.

 వీటిలో తమకు వ్యతిరేకంగా కథనాలు వస్తాయని అంటూ.. తెలుగుదేశం వారు ఆ చానళ్లను బంద్ చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం తమకు అనుకూలంగా పనిచేసే చానళ్లకే పర్మిషన్ ఇస్తున్నారు. వేరే వాటన్నింటినీ ఆపించేస్తున్నారు. మరి తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్లు ఏబీఎన్ , టీవీ 9 వంటి చానళ్లను ఆపించినప్పుడు తెలుగుదేశం వారు గగ్గోలు పెట్టారు. అయితే ఇప్పుడు వాళ్లే ఏపీలో తమకు వ్యతిరేకం అనుకొన్నమీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు ఇదేం లెక్క?! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -