Sunday, May 5, 2024
- Advertisement -

ఒడిషాలో మావోయిస్టుల‌కు చావుదెబ్బ‌…

- Advertisement -

ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్కన్‌గిరి జిల్లా బెజ్జింగ్‌వాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు అగ్రనేత రణదేవ్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. మిగతావారు ఘటనాస్థలం నుంచి పరారయ్యారని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.

ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందనీ, మిగిలిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్ గఢ్ లో భద్రతాబలగాలపై మావోయిస్టులు విరుచుకుపడిన నేపథ్యంలో ఐదుగురు సభ్యుల మరణం మావోలకు గట్టి దెబ్బేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -