ప్రేమలో విఫలం అయిన ప్రేమికులు రైలుకిందపడో లేకా ఉరి వేసుకొనో లేక ఇతర మార్గాల ద్వారా ఆత్మహత్యలు చేసుకోవడం చూశాం. కాని ఓ పాకిస్థాన్ యువకుడు మాత్రం ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో ఆత్మహత్య చేసుకొనేదానికి కొత్త దారి వెతుక్కున్నాడు. భారత సైన్యం చఎ ేతిలో చనిపోవడం కోసం బోర్డర్ దాటొచ్చాడు. అతణ్ని అదుపులోకి తీస ఉగరుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు.
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని జల్లోక్ అనే గ్రామానికి చెందిన మహ్మద్ అసిఫ్ (32) తన వదిన వాళ్ల చెల్లెల్ని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అసిఫ్ను ఇష్టపడింది. అమ్మాయి కుంటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ప్రేమించిన అమ్మాయికి వేరేవారితో పెళ్లిచేశారు. కొంత కాలం తర్వాత ఆమె భర్తనుంచి విడాకులు తీసుకుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి తల్లిదండ్రలు ఒప్పుకోలేదు.
పవిత్ర రంజాన్ మాసంలో బలవన్మరణానికి పాల్పడం పాపమని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కానీ ఎలాగైనా చనిపోవాలనుకున్నాడు. బోర్డర్ దాటితే భారత సైనికులు కాల్చి చంపుతారని అనుకున్నాడు. అనకున్నదే తడవుగా.. సరిహద్దు దాటొచ్చాడు. మబోక్ బోర్డర్ పోస్ట్ దగ్గర అతణ్ని పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లకు తన గోడు చెప్పుకొని వాపోయాడు.
అసిఫ్ చెప్పింది విన్న పోలీసులు.. అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన అతణ్ని మమడాట్ పోలీసులకు అప్పగించారు. ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్, ఫారెనర్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు బుక్ చేశారు.