- Advertisement -
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం పవన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా రంగంపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. పవన్ కాన్వాయ్లోని లోని ఓ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. వారిలో నలుగురు పవన్ బౌన్సర్లు ఉన్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం పవన్ మదురపూడి విమానాశ్రయం చేరుకున్న పవన్ విమానంలో హైదరాబాద్కు బయలు దేరారు.