Monday, May 27, 2024
- Advertisement -

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ మూడో భార్య‌ లెజ్నెవో త‌ల్లి మృతి

- Advertisement -

సినిమాల‌ను వ‌దిలేసి రాజ‌కీయాల్లో త‌న ఆలోచ‌న‌లకు అనుకూలంగా ఏవేవో ప‌నులు చేస్తూ బిజీగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న ల‌జ్నెవో మూడో భార్య‌. లెజ్నెవో ర‌ష్యా దేశ‌స్తురాలు. సినిమాల్లోకి ప్ర‌వేశించిన స‌మ‌యంలో ప‌వ‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్ప‌టి నుంచి భార‌త్‌లోనే (హైద‌రాబాద్‌)లో ప‌వ‌న్‌తో క‌లిసి జీవిస్తోంది. అయితే ఆమె త‌ల్లి మృతి చెందార‌ని స‌మాచారం.

ర‌ష్యాలో ఉంటున్న లెజ్నొవో త‌ల్లి కొంత‌కాలంగా క్యాన్స‌ర్ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోంది. చికిత్స పొందుతున్న స‌మ‌యంలోనే ఇటీవ‌ల మూడు రోజుల కింద‌ట హ‌ఠాన్మ‌ర‌ణం పొందార‌ని స‌మాచారం. త‌ల్లి మ‌ర‌ణంతో అన్న లెజ్నెవో షాక్‌కు గుర‌య్యింది. త‌న త‌ల్లి మ‌ర‌ణంతో విషాదంలో మునిగింది. విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ త‌న భార్య‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకొని ఓదార్చాడు. లెజ్నెవో త‌ల్లి కోసం ర‌ష్యా వెళ్లనున్నార‌ని స‌మాచారం. అయితే ఈ విష‌యం తెలుసుకున్న మెగా కుటుంబ‌స‌భ్యులు ప‌వ‌న్ ఇంటికి ఓదార్చార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్‌, లెజ్నెవోను ఓదార్చి వెళ్లారంట‌. అయితే ప‌వ‌న్‌, లెజ్నెవో ఆమె అంత్య‌క్రియ‌ల కోసం ర‌ష్యా వెళ్లారా.. లేదా అనేది తెలియ‌డం లేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -