Tuesday, April 30, 2024
- Advertisement -

వైసీపీలో సమరోత్సాహం..తగ్గుతున్న బాబు గ్రాఫ్

- Advertisement -

రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా 30 రోజులు సమయం ఉంది. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైయస్ జగన్ చేస్తున్న బస్సు యాత్రకు భారీ స్పందన వస్తంది. వైసీపీ కేడర్‌లోనూ ఫుల్ జోష్ కనిపిస్తోంది.మరోవైపు టీడీపీ కూటమిలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో సీట్ల ఎంపిక జరగలేదు. నేతల మధ్య సర్దుబాటు జరగడం లేదు. ఇప్పటికీ నిత్యం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

నెల రోజులు సమయం మాత్రమే ఉన్నా ఇప్పటికీ టీడీపీ కూటమి కేడర్‌కు భరోసా ఇవ్వలేకపోతున్నారు. జనసేకు కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ఎంపికతోపాటు బీజేపీకి కేటాయించిన సీట్లపైనా నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రెండు పార్టీల్లోనూ వలస వచ్చిన నాయకులకే టికెట్లు ఇవ్వడంపై మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు ఆగ్రహంతో ఉన్నారు. వారంతా టికెట్ దక్కించుకున్న వారికి సహకరిస్తారన్న నమ్మకం లేదు.

దీనికితోడు టీడీపీ ఓట్లు జ‌న‌సేన‌, బీజేపీకి వేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అలాగని టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నచోట్ల ఆ రెండు పార్టీల ఓట్లు కూడా ట్రాన్ఫర్ అవుతాయన్న ధీమా కూటమి నేతల్లో లేదు. పైకి మూడు పార్టీలు కూటమి కట్టినా.. స్థానిక నాయకత్వం మాత్రం ఇప్పటికీ దాన్ని పూర్తిస్థాయిలో అంగీకరించడం లేదు

పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే కలిసొచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ పవన్ పిఠాపురంలో తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన పవన్ కళ్యాణ్‌కు అసలు విషయం బోధపడినట్టుంది. రోజురోజుకు పవన్ గ్రాఫ్ తగ్గుతోంది. భారమంతా టీడీపీ నేత వర్మపైనే పెట్టేశాడు పవన్. ఆయనకు తోడు తనకు మద్దతుగా ప్రచారం కోసం కొంతమంది జబర్దస్త్ షో కమెడియన్లను రప్పించుకున్నాడు.మరోవైపు చంద్రబాబు ప్రజాగళం సభలకు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. బాబు ప్రసంగంలో ఎంతసేపూ జగన్‌ను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు నేను ఇది చేశాను అని చెప్పలేని పరిస్థితిలో బాబు ఉన్నాడు. ఇది కూడా టీడీపీ గ్రాఫ్ తగ్గడానికి కారణం అంటున్నారు.

మరోవైపు వైయస్ఆర్‌సీపీలో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది. సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణతో మొన్నటి వరకు కొంత వ్యతిరేకత ఉందన్న భావన కూడా ఇప్పుడు పూర్తిగా అనుకూలంగా మారిపోతోంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల దాటి గుంటూరుకు చేరిన యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలపై ఉంది. సీఎం జగన్ యాత్ర నాటికి ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా మారతాయని వైసీపీ కేడర్ ధీమాగా ఉంది. 2019లో ఇక్కడ సాధించిన సీట్లకు కొంచెం అటూ ఇటుగా ఈసారి కూడా రావడం ఖాయమన్న భరోసా నేతల్లో కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -