Thursday, May 16, 2024
- Advertisement -

నగ‌ర వాసుల మెట్రో క‌ల నెర‌వేర‌బోతోంది….

- Advertisement -

ఇన్నాల్లు ఎంత‌గానొ ఎదురు చూస్తున్న న‌గ‌ర వాసుల‌ల మెట్రోక‌ల త్వ‌ర‌లో నెర‌వేర‌బోతోంది. మెట్రో రైల్ సేవల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నాగోలు నుంచి సికింద్రాబాద్, బేగంపేట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి మీదుగా మియాపూర్ వరకూ తొలి దశ రైళ్లు నడవనున్నాయి.

నవంబర్ 28న మెట్రో ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోడీకి ఆహ్వానం పంపారు. ఆ లేఖను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

మెట్రోరైలును ప్రారంభించాల్సిందిగా 25-5-2017న వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయాన్ని ఈ లేఖలో గుర్తుచేసిన సీఎం కేసీఆర్‌.. నవంబర్‌లో ఇందుకోసం రావాలని ఈ లేఖలో కోరారు. రూ. 15,000 కోట్ల వ్యయంతో పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో అతిపెద్ద ప్రాజెక్టుగా.. హైదరాబాద్‌ మెట్రోరైలును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని లేఖలో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -