వైసీపీ అధినేత వ్యవహారశైలి పై ఎప్పటినుంచో.. కామెంట్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. తనకు అవసరం లేని వారిని గురించి అయిన పెద్దగా పటించుకోరు అనే టాక్ ఉంది. ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేని వారి గురించి జగన్ పెద్దగా పట్టించుకోడు. ఈ విషయంను వైసీపీలోని కొందరు నేతలు ఓపెన్ గానే అంటూ ఉంటారు.
తాజాగా ఇలాంటి అనుభవమే కొంతకాలం విజయవాడకు చెందిన వంగవీటి రంగాకు ఎదురవుతోందని గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ ను పార్టీలోకి తీసుకొచ్చిన జగన్.. వంగవీటి రాధకు కేటాయించిన సీటును ఆయనకు ఇచ్చి… రాధకు మరో ప్రత్యామ్నాయం చూస్తానని చెప్పినట్టు సమాచారం. అయితే ఈ విషయం పై ఇప్పటివరకు జగన్ నుంచి రాధకు ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని సమాచారం. దాంతో తనకు వైసీపీలో ప్రాధాన్యత పెద్దగా లేదని వంగవీటి రంగా తనయుడు ఆవేదన చెందుతున్నాడట.
ఎన్నికల వరకు ఇదే పార్టీలో ఉండటం వల్ల తనకు లాభం వచ్చేలా ఏం లేదని.. జగన్ కు బై చెప్పి మరో పార్టీలో చేరడమే బెస్ట్ అని భావిస్తున్న వంగవీటి రంగా.. జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కీలక నేతలు.. పార్టీలో నీకు అందరు గుర్తించే స్థానం ఉంటుందని.. పార్టీలో నీకు జగన్ మంచి ప్రాధాన్యత ఇస్తారని.. ఆయనకు చెబుతున్నారట. వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లకు గాలం వేయాలని చూస్తున్న జగన్ కు… కాపు నాయకుడిగా గుర్తింపు ఉన్న రంగా తనయుడు రాధ ఊహించని షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.
{youtube}MFlKZr6GCOs{/youtube}