- Advertisement -
ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా భాగంగా రాహుల్ పేద కుటుంబాలపై వరాలజ ల్లులు కురిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపేద కుంటుంబానికి రూ.6000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వేస్తామని హామి ఇచ్చారు. ఏడాదికి రూ. 72000 ఆర్థిక సహాయం అందుతుందన్నారు.
కనీస ఆదాయ పథకం గ్యారంటీ పథకం కింద దేశంలోని సుమారు 25 కోట్ల మందికి ఈ మొత్తం అందజేస్తామన్నారు. దేశ జనాభాలో వీరు 25 శాతం మంది ఉంటారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోందన్నారు. తాము పథకం ప్రకటించే ముందు అన్ని విధాలుగా ఆలోచించామని, కచ్చితంగా అమలయ్యే పథకం తమదని రాహుల్ గాంధీ అన్నారు. నెలకు రూ.12,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
