Monday, April 29, 2024
- Advertisement -

రామ్ చరణ్ ఫ్యాన్ ఎలా చనిపోయాడో తెలుసా..?

- Advertisement -

పెద్ద పెద్ద డైలాగ్స్ కెమెరా ముందు చెప్పడానికి పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒక్కటికి రెండుసార్లు తడబడుతుంటారు. కానీ నిండా ఐదేళ్లు కూడా లేని ఓ చిన్నోడు.. అసలు తడబడకుండా ఓ పెద్ద డైలాగ్ చెప్పి.. సోషల్ మీడియాలో సంచలనం అయ్యాడు. కేవలం డైలాగ్ చెప్పాడమే కాకుండా.. సినిమాలో హీరో చూపించే రౌద్రాన్ని తలపించేలా ఆ బుడ్డోడు ప్రదర్శించిన నటన అందరినీ కదలించింది. చివరికి ఆ డైలాగ్ చెప్పిన స్టార్ సైతం బుడ్డోడి ప్రతిభను చూసి మురిసిపోయి నేరుగా ఆ చిన్నోడిని కలుసుకున్నాడు. ఇదంతా రెండేళ్ల క్రితం యూట్యూబ్‌లో పరుశురామ్ అలియాస్ బాలధీరకు కేవలం ఒక్క డైలాగ్ ద్వారా వచ్చిన పాపులారిటీ. కానీ విషాదమేమిటంటే.. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ చిన్నోడు అనారోగ్యం కారణంగా ఇటీవలే కన్నుమూశాడు. కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న పరుశురామ్ వ్యాధి ఎక్కువవడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. పరుశురామ్ మరణంతో రామ్ చరణ్ అభిమానులంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. రెండేళ్ల క్రితం హీరో రామ్ చరణ్ పరుశురామ్ ను నేరుగా కలిసి అతని చదువకయ్యే ఖర్చులను కూడా భరిస్తానని అప్పట్లో మాటిచ్చాడు. ఆ సందర్భంగా చాలాసేపు అతనితో ముచ్చటించి.. ఆ చిన్నోడి చెప్పిన డైలాగులకు అబ్బురపడ్డాడు. కానీ ఇంతలోనే.. విషాదం వెక్కిరించడంతో పరుశురామ్ కు పదేళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. పరుశురామ్ మరణవార్త సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో పరుశురామ్ కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ కూడా తెగ బాధపడినట్లు తెలుస్తోంది. పరుశురామ్ పెద్ద పెద్ద చదువులు చదివించాలని రామ్ చరణ్ అనుకున్నాడు. కానీ ఇంతలోనే ఇలా జరిగినందుకు చరణ్ కంటతడిపెట్టుకున్నాట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -