Friday, May 10, 2024
- Advertisement -

రిషితేశ్వరి విషయంలోచంద్రన్న మౌనమెందుకు..?

- Advertisement -

రిషితేశ్వరి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం సృష్టించింది. తన సీనియర్లు తనను ఎంతో చిత్రవధ చేశారని, ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా కనీసం పట్టించుకోవడంలేదని సూసైడ్ లెటర్ లో పేర్కొంది.

అందుకోసమే  ఆమె చనిపోయిందనే విషయం కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఇంతటి తీవ్ర స్థాయిలో ఓ విద్యార్థి చనిపొతే.. ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు కిమ్మనకుండా.. ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నది ప్రశ్నార్థకం. ఏ చిన్న ఘటన జరిగినా ఆగమేఘాల మీద చర్చల్లోకి వచ్చేసి చెడామెడా తిట్టేసే విశ్లేషకులు ఈవిషయంలో చంద్రన్నను ఎందుకు నిలదీయడం లేదు.కనీసం స్పందచమని ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారు.

ఈవిషయాన్ని ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు ఎందుకు అంత సీరియస్ గా తీసుకోలేదు. కుల రాజకీయాలు చంద్రబాబును రితికేశ్వరి వ్యవహారంలోదూరంగా ఉంచుతున్నాయా.? ఓ వర్గం వారు చంద్రబాబు నాయుడు మీద వత్తిడి తీసుకువస్తున్నారా..? ఇలాంటి చాలా అనుమానాలు జనాల్లో రేకెత్తుతున్నాయి. అయినా ఇంత దారుణం జరిగినా కానీ చంద్రబాబు లాంటి వ్యక్తి కనీసం యాక్షన్ తీసుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు విషయం.కాదంటారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -