- Advertisement -
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో 70 గణతంత్రవేడుకలు ఘనంగా జరిగాయి. 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ముఖ్య అతిథిగా విచ్చేశారు. 10 గంటలకు ఇండియా గేట్ నుంచి రాజ్పథ్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసాలతోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.