- Advertisement -
తెలంగాణాలో ఐటీ దాడులతో సంలనం సృష్టించిన అధికారులు టార్గెట్ ఇప్పుడు ఏపీమీద పడింది. అధికార పార్టీ నాయకులే టార్గెట్గా శుక్రవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు. విజయవాడ, నెల్లూరు, విశాఖ, గుంటూరు, కాకినాడ లో అధికారులు సోదాలు చేస్తున్నారు. టీడీపీ నేతల లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.
ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో సాగుతున్న సోదాల్లో ఐటీ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. విజయవాడ పరిధిలోని సదరన్ డెవలపర్స్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న సోదాల్లో భాగంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
సదరన్ కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రికి సంబంధించిన లావాదేవీల డాక్యుమెంట్లను అధికారులు కనిపెట్టి, వాటిని తమ అధీనంలోకి తీసుకున్నారని సమాచారం.సదరన్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ గుర్తించింది.
సదరు మంత్రి ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో భూముల లావాదేవీలను జరుపగా, వాటన్నింటిపైనా ముందునుంచే నిఘా పెట్టిన ఐటీ అధికారులు, ఈ సోదాల్లో వాటిని గుర్తించిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఐటీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.