Friday, April 19, 2024
- Advertisement -

ఏకంగా భారత్ లో ఏడు చోట్ల సోదాలు.. ఏం దొరుకుతుంది అని ఎదురు చూపులు..!

- Advertisement -

జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తోంది. ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రవాద సంస్థకు సహకరించే వారే లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అనుమానితులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఎన్​ఐఏ వర్గాల సమాచారం.


ఢిల్లీలోని జాఫ్రాబాద్​ ప్రాంతం సహా బెంగళూరులోని రెండు ప్రాంతాల్లో ఎన్​ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు కేరళలోని కోచి, కన్నూరులోని నాలుగు ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరపుతున్నారని ఎన్​ఐఏ వర్గాలు వెల్లడించాయి.

అనుమానితులు అందరూ విద్యావంతులే అని, ఐఎస్​కు ప్రభావితం అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపాయి. విచారణ అనంతరం ఎన్​ఐఏ వీరిని అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

మొన్న వాయిదా.. నేడు ఇక్కడ ఎన్నికలు..!

వైసిపి కి అందుకే ఓట్లు వేశారు : పవన్ కళ్యాణ్..!

జనసేన పవన్ కళ్యాణ్ బాధకి కారణం వారే.. మీతో మాకు ఇక వద్దు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -