దేశంలో కరోన్ వైరస్ విజృంభిస్తోంది. పంజాబ్లోనూ కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. పంజాబ్లోని యాంటీ కరోనావైరస్ టీకా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నటుడు సోను సూద్ ను నియమిస్తున్నట్టు ప్రకటించింది.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన నివాసంలో నటుడు సోనూ సూద్తో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన చేశారు. కాగా, కరోనా వెలుగుచూసిన నేపథ్యంలో గతేడాది కేంద్రం దేశవ్యాప్తం లాక్డౌన్ ప్రకటించింది. ఈ క్రమంలో లక్షలాది మంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండి, తాగడానికి నీరు, సొంతగ్రామాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇలాంటి కష్ట సమయంలో నటుడు సోనూసూద్ వలస జీవులకు అండగా నిలిచారు. వేలాది మంది తినడానికి ఆహారం అందించారు. వలస కార్మికులు వారి స్వస్థలాలకు చేరడానికి రవాణా సౌకర్యాలు సైతం కల్పించారు. దీంతో ఆయన పేరు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మార్మోగిపోయింది. ప్రజలను టీకాలు తీసుకోవడానికి సోనూసూద్ కృషి చేయనున్నారు.
దేశంలో కొత్తగా 1.52 లక్షల కరోనా కేసులు
72 గంటల్లో 12 మంది ఉగ్రవాదులు హతం !
హోం క్వారంటైన్లోకి పవన్ కళ్యాణ్ !