బిగ్బాస్లోనికి తాజాగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడికి సంబంధించిన అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు.. ఈయన కామన్ మ్యానే కాదని.. చాలా జాదు మంగళ సింగ్ అనే విషయం బయటకు రావడంతో.. బిగ్బాస్ ప్రేక్షకులు, ఆయనను ఇన్నాళ్లూ అభిమానించిన వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. పొట్టిగా.. చూసేందుకు ఉత్తముడిలా కనిపించే నూతన్ నాయుడు.. ఏకంగా కోట్ల రూపాయలను కుచ్చుటోపీ వేశాడంటూ.. శివ అనే బాధితుడు తాజాగా వెళ్లడించాడు. పొలిటికల్ లాబీయిస్ట్గా నూతన్ నాయుడు తనను తాను పరిచయం చేసుకుంటూ.. కోట్ల రూపాయలకు అనేకమందికి కుచ్చుటోపీ వేశాడంటూ శివ అనేక విషయాలను వెళ్లడించడం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. కేవలం ఆరోపణలతోనే కాకుండా.. స్వయంగా నూతన్ నాయుడు రాహుల్ గాంధీ గురించి, చంద్రబాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి, బాల కృష్ణ సహా దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులందరి గురించి నూతన్ నాయుడు మాట్లాడిన మాటల ఫోన్ ఆడియోను వినిపించడంతో.. ఈ పొట్టోడు.. మరీ ఇంత ముదురనుకోలేదంటూ ఇప్పుడు అనాల్సి వస్తోంది.
ప్రైవేటు యూనివర్శిటీలను పెట్టిస్తా.. మీకు నామినేషన్ పదవులను ఇప్పిస్తా.. కాంట్రాక్టులు ఇప్పిస్తా.. అంటూ నూతన్ నాయుడు ఆశచూపి తమ దగ్గర ఎంతెంత దండుకున్నాడో బాధితులు ఒక్కొక్కరిగా బయటకొచ్చి చెబుతున్నారు. నూతన్ నాయుడు తనను తాను ఓ సామన్యుడిగా పనిచయం చేసుకుని బిగ్బాస్ హౌస్లోనికి వచ్చినప్పటికీ.. అతను అసలు సామన్యుడే కాదని తేలింది. ఎప్పుడూ 20 మంది బాడీ గార్డులు.. పది కార్ల కాన్వాయ్తో నూతన్ నాయుడు తిరుగుతుంటాడనే విషయాన్ని సైతం బాధితులు బయటపెట్టారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉండే అతని మెంటర్ టెక్నాలజీ కార్యాలయం ఉందని, అతను తమకు కుచ్చుటోపీ వేసి.. చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్నాడంటూ శివ వెళ్లడించాడు. ఇతని పేరు మేదపిరెడ్డి నూతన్ కుమార్ అని.. అయితే తమను మోసం చేసిన తర్వాత.. నూతన్ నాయుడిగా మార్చేసుకుని తిరుగుతున్నాడని అందుకే ఇన్నాళ్లూ అతను ఇతను వేరనుకున్నామంటూ బాధితులు వెళ్లడించడం కొసమెరుపు. అసలు నూతన్నాయుడు కామన్మెన్ కంటెస్టెంట్ కాదని.. మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి జైసమైక్యాంధ్ర పార్టీ తరఫున పాదరక్షల గుర్తుపై నూతన్ నాయుడు ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో పోటీ చేశాడనే విషయం కూడా చాలామందికి తెలియదంటూ బాధితులు వెళ్లడించడంతో.. ఈయన ఇంత ఘనుడా.. అంటూ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారిప్పుడు. చూద్దాం.. ఈ జాదూ ఎన్ఎన్ గురించి మరెన్ని విషయాలు బయటపడతాయో.