- Advertisement -
తిరుమలలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరై వాటిని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ రామానుజ చేసిన సేవలకు జ్ఞాపకం సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
ఈ ఉత్సవాల్లో భాగంగా దేశంలోని 106 ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలు, పుస్తకావిష్కరణలు, సదస్సులు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహించింది. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు టిటిడి ఉన్నతాధికారులతో పాటు పలువురు అర్చకులు, విశేషంగా భక్తులు హాజరయ్యారు.