ఈ ఏడాది 2020 మనిషి జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనిది. చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన కరోనా మహమ్మారితో లక్షల మంది కన్నుమూయగా.. కోట్ల మంది కరోనా భారిన పడుతున్నారు. ఇక ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. తుఫాన్లు, సునామీ, భూకంపాలతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఓ వైపు కరోనా.. మరోవైపు ప్రకృతి బీభత్సంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.
అమెరికా లాంటి అగ్ర రాజ్యం కరోనా బీభత్సమే కాదు.. ప్రకృతి విలయతాండవంతో అష్టకష్టాలు పడుతుంది. తాజాగా అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా దేశాల్లో ఈటా తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది. గ్వాటెమాలాలో, అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్నది. తుఫాన్ తీవ్రత అధికంగా ఉండటంతో గ్వాటెమాలాలో ఇప్పటికే 150 మంది మరణించారు.
ఇది హరికేన్ మిచ్ కంటే ఈ తుఫాన్ తీవ్రత అధికంగా ఉన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అటు ఫ్లోరిడాలో కూడా ఈ తుఫాన్ భీభత్సం కొనసాగుతోంది. తీరప్రాంతంలోని ప్రజలను హుటాహుటినా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?
మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?