ఈ కాలంలో ఆడపిల్లల్ని,ఎటైన పంపాలంటేభయం,కనీసం విధ్యాబుద్ధులైన నేర్చుకొమ్మని పంపాలన్నా తల్లిదండ్రులకు తెలియనిఆందోళన. చివరకు స్కూల్లలో బాలికలకు భద్రత లేకుండా పోతోంది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ దారి తప్పారు. తప్ప తాగి స్కూల్కు రావడమే కాదు.. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఒకటి రెండుసార్లు సర్దిచెప్పుకున్నా.. సదరు ఉపాధ్యాయుడి తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడంతో విద్యార్థినిలు విషయాన్ని బయటపెట్టక తప్పలేదు.
వివరాల్లోకి వెల్తే…తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో బాలికల గురుకుల పాఠశాలలో ఉన్న వైఎస్ ప్రిన్సిపల్ కృపారావు,విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడు తున్నాడట.సాధారణ తనిఖీలో భాగంగా సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త టి.రాధా సుధారాణి మంగళవారం పాఠశాలలో విచారణ చేపట్టారు.ముందుగా ప్రిన్సిపల్, స్టాఫ్ను విచారించిన ఆమె తర్వాత స్టూడెంట్స్ను విచారించారు.
ఈ సందర్భంగా వైఎస్ ప్రిన్సిపల్ కృపారావు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని,తమపై కీచక పర్వానికి పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో తెలియక,నిస్సహాయ స్థితిలో ఆ బాధను భరిస్తూ నెట్టుకొస్తున్నామని చెప్పి బోరుమన్నారు.దీంతో ఆమె కృపారావుపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
విద్యార్థినులు తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కుట్రలో భాగమేనని కృపారావు అంటున్నారు. స్కూల్లోని కొందరు లేడీ టీచర్లే తనపై కుట్రపన్ని బాలికలతో అలా చెప్పించారని ఆరోపించారు. విచారణలో వైస్ ప్రిన్సిపాల్ దోషిగా తేలితే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.