Sunday, May 19, 2024
- Advertisement -

ఓటు వేయాలని కోరనున్న రజనీకాంత్

- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గరపడుతోంది. ఓటు హక్కుపై జనంలో అవగాహన పెంచేందుకు.. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే.. ప్రముఖ హీరో, హీరోయిన్లు, క్రీడాకారులతో ప్రకటనలు రూపొందించి జనంలో వదులుతున్నారు.

ఈ కార్యక్రమాన్ని రజనీకాంత్ లాంటి స్టార్ తో నిర్వహిస్తే మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అనుకున్నదే తడవుగా.. రజనీకాంత్ ను ఎన్నికల సంఘం అధికారులు సంప్రదించారు. తమ కార్యక్రమాల్లో భాగం కావాలని విజ్ఞప్తి చేశారు.

అయితే.. ఈసీ రిక్వెస్ట్ కు రజనీ ఎలా రియాక్ట్ అయ్యారన్నదీ ఇంకా బయటికి రాలేదు. 

ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న రజనీకాంత్.. ఇప్పుడు ఓటు హక్కు వినియోగించాలని జనానికి పిలుపు ఇస్తారా లేదా అన్నదే.. ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -