తమిళనాడు రాజకీయాల్లో సంచనం చోటు చేసుకోబోతోందా…? తమిళ్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశానికి రేపే ముహూర్తం కుదిరిందా…? పరిస్థితులు చూస్తుంటె అవుననే అనిపిస్తున్నాయి.మూడు రోజుల క్రితం దేవుడు ఆదేశిస్తె…రాజకీయాల్లోకి రావాడానికి సిద్ధంగా ఉన్నానంటూ సరైన సమయంలో సరైన నిర్ణయాన్నిప్రకటిస్తానని చెప్పిన అభిమానుల్లో హీట్ పెంచారు తమిళ్ స్టార్.
రజనీకాంత్ తన అభిమానులతో కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంతో పొలిటికల్ ఎంట్రీపై దాదాపు రెండు దశాబ్దాలకుపైగా అభిమానులను ఊరిస్తూ వస్తున్న దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి రాజకీయాల్లో ప్రవేశించడం ఖాయమని తెలుస్తోంది. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల అభిమానుల సమావేశంలో తలైవా ప్రకటించడంతో రాజకీయవర్గాలు కూడా ఆయన అరంగేట్రంపై అంచనాలు వేస్తున్నాయి.
{loadmodule mod_custom,Side Ad 1}
తన పొలిటికల్ ఎంట్రీ గురించి తానిక చెప్పాల్సిందేమీ లేదని.. తాను చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేశానని.. టైం వచ్చినప్పుడు చెబుతానంటూ చెప్పిన రజనీకాంత్ మాటల నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇప్పట్లో ఉండదన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. బుధవారం రాత్రి పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు.
రజనీ తన పొలిటికల్ ఎంట్రీపై శుక్రవారం కీలక ప్రకటన వెలువరించే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ స్వయంగా రజనీ ఇంటికి వెళ్లి మరీ.. ఆయన్ను రాజకీయ రంగప్రవేశం చేయాలని కోరినా ఓకే చెప్పని రజనీ.. ఇటీవల కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ మార్పుల నేపథ్యంంలో ఎంట్రీ ఇవ్వాలన్న ఆసక్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు.
{loadmodule mod_custom,Side Ad 2}
ఇప్పటి వరకు వరకూ అభిమానులనుంచి మాత్రమే రజిని రాజకీయ ఆరంగ్రేటం వస్తున్నా …ఎప్పుడనేది క్లారిటీ రావడంలేదు.శుక్రవారం రజినీ రాజకీయ రంగ ప్రవేశం తేలనుంది.రేపు ప్రకటన చేస్తారో లేక ఉత్కంటను కొనసాగిస్తారనేది రేపటితో తేలిపోనుంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Also read