Tuesday, May 7, 2024
- Advertisement -

పరిటాల శ్రీరామ్ ను టీడీపీ నేతలే తొక్కేస్తారా?!

- Advertisement -

అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ నుఎదగనీయకూడదని ఆ జిల్లా నేతలే కంకణం కట్టుకొన్నారా?

శ్రీరామ్ ఎదిగితే తమ తమ ఉనికికి ప్రమాదమని జిల్లాలోని టీడీపీ నేతలు భావిస్తున్నారా? శ్రీరామ్ ను మొక్కగానే తుంచుతూ రావాలి.. మాను అయితే కష్టమని భావిస్తున్నారా? ప్రస్తుతం అనంతపురం జిల్లా టీడీపీ నేతల తీరును చూస్తుంటే కలిగే అనుమానాలు ఇవి. శ్రీరామ్ పై ఒక్కరు కాదు, ఇద్దరు కాదు అనేక మంది తెలుగుదేశం నేతలు గుర్రుగా ఉన్నారు. శ్రీరామ్ తీరును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

శ్రీరామ్ తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకొంటుండటాన్ని వీళ్లంతా వ్యతిరేకిస్తున్నారు. అనంతపురం ఎమ్మెల్యే, ధర్మవరం ఎమ్మెల్యే, పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే.. వీళ్లంతా శ్రీరామ్ తో భయపడుతున్నారు. భవిష్యత్తులో శ్రీరామ్ తమ నియోజకవర్గాలకు వచ్చేస్తాడేమో.. అని వీరంతా భయాందోళనకు గురవుతున్నారు. తన తల్లి సునీతను రాప్తాడు నియోజకవర్గంలోనే ఉంచి.. శ్రీరామ్ కొత్త నియోజకవర్గాన్ని చూసుకొందామనే భావనలో ఉన్నాడు. తమకు బాగా పట్టు ఉన్న పెనుకొండ నియోజకవర్గం.. అంతో ఇంతో పర్వాలేదనిపించే ధర్మవరం, అనంతపురం నియోజకవర్గాలు శ్రీరామ్ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆయా నియోజకవర్గాలన్నింటిఓనూ తెలుగుదేశం నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

 ఇలాంటి నేపథ్యంలో శ్రీరామ్ అక్కడికి వెళితే వారికి ప్రమాదం వచ్చినట్టే! దీంతో వారు ఇప్పుడు శ్రీరామ్ ను అణగదొక్కడానికి అతడు తమ నియోజకవర్గాల జోలికి రాకుండా ఉండటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవరికి తోచినట్టుగా వారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్లకు జేసీ దివాకర్ రెడ్డి కూడా ఒక పెద్ద దిక్కులా కనిపిస్తున్నాడు. పరిటాల వర్గంలో పడని దివాకర్ రెడ్డిని వైపు ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంతా వెళుతున్నారు. తద్వారా తమ సీట్లకు శ్రీరామ్ నుంచి ప్రమాదం రాకుండా చూసుకొంటున్నారు. మరి శ్రీరామ్ ఇంతటితో వెనక్కు తగ్గే అవకాశాలు అయితే లేవు. మరి రానున్న రోజుల్లో ఈ రాజకీయాలు మరింత రసకందాయంలో పడే అవకాశాలున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -