- Advertisement -
తెలుగు దేశం నాయకులకు చిక్కులు తప్పడం లేదు. మెన్నామధ్య ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు ఓ అమ్మాయిని ఏడిపించిన కేసులో ఇరుక్కుంటే ఇప్పుడు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుమారుడు మరో కేసులో బుక్ అయ్యాడు.
అసలు బ్యాంకులకు అప్పుల కేసులో సతమతమవుతున్నసుజనా చౌదరికి పుత్రరత్నం సాయికార్తిక్ రూపంలో మరో కష్టం వచ్చింది. కారు రేసు కేసులో బంజారాహిల్స్ పోలీసులు సాయి కార్తిక్ కార్ రేసులకు వెళ్తూండగా పట్టుకున్నారు. సాయి కార్తీక్ నడుపుతున్న జర్మన్ కారు ఎపి 09 పివీ 9699 ను సీజ్ చేశారు, కార్ రేసింగ్ లో పాల్గొన్న వారందరికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.