- Advertisement -
తెంగాణా సీఎం సిబ్బంది కాన్యాయ్ ప్రమాదానికి గురయ్యింది. సీఎం పర్యటన ముగించుకొని కరీనంగర్కు వెల్తున్న డిస్ట్రిక్ట్ గార్డ్ వాహనం మనకొండూర్ మండలం చెంజర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న కార్ ను ఢీకొనడంతో కారులో ఉన్న భార్యాభర్తలు, డిస్ట్రిక్ట్ గార్డ్ వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు.
రైతు బంధు పథకం ప్రారంభం నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (మే 10) కరీంనగర్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రమాద విషయం గుర్తించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరందరూ కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.