Wednesday, April 24, 2024
- Advertisement -

ఈరోజు ఇక చాలు.. వాయిదా వేసిన కేసిఆర్..!

- Advertisement -

శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. దివంగత సభ్యులు నోముల నర్సింహయ్య మృతిపట్ల సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ సహా మంత్రులు, ఇతర సభ్యులు దివంగత నేతను గుర్తు చేసుకున్నారు.

నోముల నర్సింహయ్య మృతికి సంతాపం తీర్మానం ప్రవేశపెట్టిన కేసీఆర్.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. రాష్ట్రానికి నర్సింహయ్య చేసిన సేవలను కొనియాడారు.

గుండెపోటుతో మృతి చెందిన నోములకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సభలో సంతాపం ప్రకటించారు.

అనంత‌రం స‌భ‌ను రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. బుధ‌వారం ఉద‌యం 10:30 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభం కానుంది.

ఆయనకి సంతాపం తెలపడం చాలా బాధాకరం: సీఎం కేసిఆర్

సీఎల్పీ మీటింగ్.. రాజ్ గోపాల్ రెడ్డి ఏం అన్నారంటే..!

సందీప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో సూపర్ స్టార్ మ‌హేష్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -