బీజేపీ పరిపాలనలో దళితులపై దాడులు పెరగాయని.. ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోని గాంధీభవన్లో దీక్ష నిర్వహించారు. దళిత, గిరిజనులపై దాడులకు నిరసనగా సోమవారం చేపట్టిన కాంగ్రెస్ దీక్షలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దీక్షలో పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలో కూడా దళితులు, గిరిజనులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దళిత, గిరిజన ద్రోహి అని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని, మొన్న దళిత ఎమ్మెల్యే సంపత్కుమార్ (అలంపూర్) శాసనసభ సభ్యత్వాన్ని అకారణంగా రద్దు చేశారని మండిపడ్డారు. దళితులకు ఇస్తామని మూడెకరాల భూమి పంపిణీ అతీగతీ లేదని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులను ప్రజలకు వివరిస్తామని… ఈనెల 23వ తేదీన ఢిల్లీలో దళిత విచారణ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
దీక్షలో మాజీమంత్రులు షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అంజన్కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.