- Advertisement -
తెలంగాణ సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు మాసాల్లోపు తెలంగాణలో పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని గురువారం నాడు హైకోర్టు ఆదేశించింది. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు నుంచి మూడు నెలల వరకు స్పెషల్ ఆఫీసర్లు కొనసాగవచ్చునని వెల్లడించింది. ఆ లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.