తెలంగాణా టీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్ పుండుమీద కారం చల్లినట్లు ఏపీ మంత్రులపై నిప్పులు చెరిగారు. వారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి లబ్ది పొందుతున్నారని తీవ్రమయిన ఆరోపణ చేశారు. నిన్న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిసి తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించిన రేవంత్ ఈ రోజు ఆంధ్రా టిడిపి డబుల్ గేమ్ రాజకీయాలను రచ్చకీడ్చారు.
డిసెంబర్ 9 నుంచి ఆయన రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టాలనుకుంటున్నారు.ఆంధ్రా మంత్రులకు తెలంగాణ లో పనేంటని ప్రశ్నిస్తూ ఎపిటిడిపి నేతల బాగోతాలను ఆయన ఏకి పడేశారు. యనమల రామకృష్ణకు కేసీఆర్ 2వేల కోట్లు కాంట్రాక్టు ఇచ్చాడు..ఆయన కేసీఆర్ మీద ఇగ వాల నిస్తాడా?’ అని రేవంత్ సంచలన వ్యాఖ్య చేశారు. పరిటాల పెళ్లికి కెసిఆర్ అంత ఉత్సాహంగా వెళ్లడం వెనక ఉన్న రహస్యాన్ని కూడా రేవంత్ వెల్లడించారు.
ఎపి లో పయ్యావుల కేశవ్ ని ప్రజలు తిరస్కరించారు. ఆయనకు ఉన్నది ఏంది..? నేను తిట్టాల్సిన అవసరం లేదని అన్నారు. కెసిఆర్ కు పరిటాల పెళ్లిలో తెలుగుదేశం నేతలు బ్రహ్మరథం పట్టడం పట్ల అభ్యంతరం చెబుతూ తెలంగాణకు వస్తే చంద్రబాబు ఎవరూ పట్టించుకోకపోవడాన్ని రేవంత్ గుర్తు చేశారు.
మమ్ములను జైల్లో పెడితే కేసీఆర్ కి ఎపి టిడిపి నేతలు దండం పెడతారా? కేసీఆర్ ఏపీకి వెళ్తే ఎపి నేతలు అంతగా మర్యాద చెయ్యాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఇన్నాల్లు టీడీపీ నాయకులు ఆడుతున్న డబుల్గేమ్ రాజకీయాలను బజారుకీడ్చారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ని తెలంగాణలో విలన్గా చూపించేందుకు తెలంగాణ టీడీపీ కష్టపడ్తోంటే, ఏపీలో కేసీఆర్ని హీరోగా చూపించడానికి టీడీపీ నేతలు ఆరాటపడ్తున్నారు. ఇది రేవంత్రెడ్డికి.అందుకె తన దారి తాను చూసుకున్నారు.