- Advertisement -
భరోసా యాత్ర పేరిట బిజేపి గిరిజనులను మోసం చేస్తోందని… నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ విమర్శించారు. గిరిజనులకు మేలు చేసే మార్గాలు వదిలేసి అనవసర అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో… గిరిజన గ్రామాలు అభివృద్ధిలో బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నాయని అన్నారు.
టిఆర్ఎస్ హయాంలో మాత్రమే గిరిజన తండాలు విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు. బిజేపి నాయకులు అంతగా మంచి చేయాలనుకుంటే పోడు భూముల సమస్యను పరిష్కరించాలని… కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గిరిజన పంచాయతీలకు అదనపు నిధులు ఇప్పించాలని అన్నారు. అమాయకులను వివాదాల్లోకి లాగి వారి మధ్య తగాదాలు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని… అది సరైన పద్దతి కాదని హెచ్చరించారు.