- తమ తెలివినంతా ఉపయోగించి భారీ చోరీ
మీకు నచ్చిన నగనను ఎంచుకోండి.. ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. ఆ నగను ఫొన్లో ఫొటో కూడా తీసుకోండి. రెండింటిని పెట్టుకొని నాలుగైదు దుకాణాల్లో కంపేర్ చేసి చూడండి. ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ కొనండి.. డబ్బులు ఊరికే రావు.. అంటూ తన లలితా జ్యూయలర్స్ ప్రకటనలు ఉంటున్నాయి. తన దుకాణానికి తానే ప్రచారకర్తగా కిరణ్కుమార్ మారారు. అతడు ఇచ్చిన ప్రకటననే మహిళలు సద్వినియోగం చేసుకొని సంస్థను బురిడీ కొట్టించారు. దీంతో తాను తవ్విన గొయ్యిలోనే కిరణ్కుమార్ పడ్డట్టు తెలుస్తోంది.
ఫొటో తీస్కొళ్లొచ్చు అని ఇచ్చిన ప్రకటనలను కిలాడీ లేడీలు తమ తెలివితేటలు ఉపయోగించి భారీ హారాన్ని ఎత్తుకెళ్లి పోయారు. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీస్ షోరూంకు డిసెంబర్ 2వ తేదీన ఇద్దరు మహిళలు బురఖా వేస్కొని వచ్చి తమకు కావాల్సిన నగ ఫొటో తీస్కున్నారు. తర్వాత తాము ఏవిధంగా తస్కరించాలని రెక్కీ నిర్వహించారు. డిసెంబర్ 3వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బురఖా వేసుకున్న ఇద్దరు మహిళలు వచ్చారు. రూ.6 లక్షల విలువైన ఓ హారాన్ని ఎంపిక చేసుకున్నారు. యాడ్లో చెప్పిన విధంగా ఫొటో తీసుకున్నారు. మాటలతో కళ్లుగప్పి ఆ నగను తమ దుస్తుల్లో దాచేసుకున్నారు. అదే సమయంలో తమ దగ్గర ఉన్న నకిలీ నగను ఒరిజినల్ స్థానంలో పెట్టేశారు. అంతకుముందు ఫొటో తీస్కున్న మాదిరి నకిలీ నగ తయారుచేయించుకొని వచ్చి అది షోరూంలో పెట్టి వారు చల్లగా జారుకున్నారు. రెప్పపాటులో జరిగిపోయిన ఈ చోరీని సిబ్బంది గుర్తించలేకపోయారు.
అసలు స్థానంలో ఉన్న నకిలీ నగలను తర్వాత గుర్తించిన లలితా జ్యూయలరీస్ సిబ్బంది షాక్కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్యూయలర్స్ యాడ్ను మహిళలు తమ తెలివిని ఉపయోగించి ఎంచక్కా చోరీ చేయడం అందర్నీ ఆశ్చర్యనా ముంచేస్తోంది.