Friday, May 3, 2024
- Advertisement -

భాజాపాకు అభ‌య‌హ‌స్తం ఇచ్చిన దేవెగౌడ పెద్ద‌కుమారుడు…?

- Advertisement -

కర్ణాటకలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి ఏపార్టీకీ సంపూర్ణ‌మైన మెజారిటీ రాక‌పోవ‌డంతో జేడీఎస్ మ‌ద్ద‌తు కీల‌కంగా మారింది. సిగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించినా ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావ‌ల‌సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను చేరుకోలేక‌పోయింది.

ఏపార్టీకి పూర్తి మెజారిటీ రాక‌పోవ‌డంతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిదింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధికారాన్ని భాజాపా కు ద‌క్క‌కుండా చేయ‌డానికి జేడీఎస్‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. కుమార స్వామిని సీఎం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముందుకొచ్చింది.

భాజాపాకూడా జేడీఎస్‌తో మంత‌నాలు జ‌రిపేందుకు రంగంలో ఆపార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. జేడీఎస్ తో చర్చలు జరపాలంటూ రాష్ట్ర నేతలను బీజేపీ అధిష్ఠానం ఆదేశించింది.అయితే ఇప్పుడు మ‌రో వార్త జనాలను ఉత్కంఠకు గురి చేస్తోంది.

బీజేపీకి దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. తన వెనుక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమంటూ, తాజాగా హోలెనరసిపూర్ స్థానం నుంచి గెలుపొందిన రేవన్న ఇప్పటికే బీజేపీకి భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ ఇదే నిజమైతే… బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -