Sunday, May 12, 2024
- Advertisement -

13 రాష్ట్రాలు, 2 కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కేంద్ర‌హోంశాఖ హెచ్చ‌రిక‌లు

- Advertisement -

రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేంద్ర హోంశాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అలాగే ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు మేఘాలయ, అసోం, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్ లలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్ల‌డించింది.

మేఘాలయ, అసోం, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్ లలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కర్ణాటక, కేరళ, ఒడిశా, సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్ లలో తుపాను ప్రభావంతో వర్షాలు పడతాయని వెల్లడించింది. గతవారంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 124 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మరో 300 మంది గాయపడ్డారు. హెచ్చరికల నేపథ్యంలో 7, 8 తేదీల్లో అన్ని పాఠశాలలకు హర్యానా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -