కర్నాటక ఎన్నికల్లో భాజాపా విజయదుంధుభి మోగించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది. ఆధికార కాంగ్రెస్ పార్టీపై స్పష్టమైన మెజార్టీ కనబరుస్తూ బీజేపీ అధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఫలితాలపై హీరో నిఖిల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
“నోట్ల రద్దు, జీఎస్టీ, విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు, ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, కర్ణాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉండటం లాంటి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ… మరోసారి బీజేపీనే గెలుస్తోంది. ప్రధాని మోదీ మెజీషియన్ లా కనిపిస్తున్నారు. కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా. అమిత్, షా, బీజేపీలకు శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా మోదీ పగలబడి నవ్వుతున్న ఓ వీడియోను అప్ లోడ్ చేశాడు.
Demonetization… GST… Highest Fuel Rates… going back on promises (AP special status) In a heavily Telugu populated karnataka and yet the BJP Wins 🤔
Looks like PM MODI sir is a Magician… Respect the Kannada people for their verdict.. congratulations @AmitShah @BJP4India pic.twitter.com/tfzkXoEQ0E— Nikhil Siddhartha (@actor_Nikhil) May 15, 2018