Thursday, May 2, 2024
- Advertisement -

ఢిల్లీలో మరో పైశాచికత్వం..!

- Advertisement -

ఢిల్లీలో పైశాచికత్వం పెరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న ఇండియా మొత్తం మీద రేప్‌లు ఢిల్లీలోనే ఎక్కువ జరిగినట్లు ఒక సర్వేలో తేలింది.

తాజాగా ఒక విద్యార్థి టీచర్‌కు పిర్యాదు చేశాడని తోటి విద్యార్థులు కర్రలతో కొట్టి చంపారు. సాధారణంగా స్కూల్స్‌లో టీచర్ ఒక విద్యార్థిని మానిటరింగ్ చేయుటకు ఒకర్ని నియమిస్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక విద్యార్థిని నియమించారు. కానీ అది అతని ప్రాణాల మీదకు వచ్చి పడింది.

కొంత మంది విద్యార్థులు తమ మీద టిచర్‌కు కంప్లైంట్ చేశాడని తోటి విద్యార్థిపై పగ పెంచుకున్నారు. తర్వాత ఒకరోజు అతడిని బయటికి తీసుకెళ్ళి కర్రలతో కొట్టి చంపారు. ఈ దారుణం జరిగిన వెంటనే ఆ విద్యార్థులు హర్యానాలోని సొంత గ్రామానికి పారిపోయారు. వీరు తొమ్మిదో తరగతి విద్యార్థులని సమాచారం. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -