కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం చంద్రబాబు ఇలా మాట్లాడారేంటి? అని అంతా చర్చించుకుంటున్నారు.బాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి నిప్పులు చెరిగారు.
ట్రంప్ను గతంలో మానసికరోగి అన్నారని…ఆ మాటలు ఇప్పుడు చంద్రబాబుకే వర్తించేలా ఉన్నాయన్నారు. చంద్రబాబు మానసిక స్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు.ఒక్కో ఓటుకు తాను ఐదు వేలు ఇస్తాననడంచూస్తె చంద్రబాబు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.
{loadmodule mod_custom,GA1}
తాను లేకుంటే ఈ రాష్ట్రమే లేదన్నట్టుగా చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వెనుకటికి ఒక ముసల్ది నేను, నా కోడిపుంజు లేకుంటే అసలు తెల్లారేదే కాదన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. 70 ఏళ్ల పాలనలో పుట్టగోసి చంద్రబాబు ఉన్నది 12 ఏళ్లు అని… మిగిలిన కాలంలో జనం బతకలేదా? అప్పుడు రోడ్లు లేవా? జనం ఏమైనా అడవుల్లో బతికేవారా అని తులసీరెడ్డి ప్రశ్నించారు.
ప్రజలు కట్టే పన్నులతో హెలికార్టర్లు, విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయలు క్యాంపు ఆఫీసులకు, తన లగ్జరీలకు ఖర్చుపెడుతున్న వ్యక్తి చంద్రబాబు అని తులసీరెడ్డి విమర్శించారు. ఇవన్నీ చూస్తె బాబు మానసిక పరిస్థితిఎలాఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}RLB93hJn8G0{/youtube}