- Advertisement -
ఇప్పటికే తెలంగాణలో నిషేధానికి గురై, కష్టాల్లో ఉన్న టీవీ 9, ఏబీఎన్లు..
తాజాగా మరో ఇబ్బందిని ఎదుర్కోనున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఈ రెండు చానళ్లపైనే కాక 6టీవీ పై కూడా దావా వేశారు.
ఎన్నికల సమయంలో ఆ మూడు చానళ్లు తనపై అనాలోచిత కథనాలను ప్రసారం చేశాయని ఆరోపిస్తూ.. ఆ మూడు చానళ్లపై పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు నష్టం జరిగేలా ఆ కథనాలున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ నాయకులను కించపరిచే విధంగా కథనాలను ప్రసారం చేసినందుకు గాను టీవీ9, ఏబీఎన్లను తెలంగాణలోని ఎంఎస్ఓలు ఈ రెండు చానళ్లను నిషేదించిన సంగతి తెలిసిందే!