Saturday, May 18, 2024
- Advertisement -

అనుమానంతో పెళ్లికూతురిని అవ‌మాన ప‌రిచిన వ‌రుడి బంధువులు

- Advertisement -
UP bride made to strip after skin disease rumours

అనుమానంతో పెళ్లిపీట‌ల మీద కూర్చుంటున్న సంయంలో పెళ్లికూతురిని తీవ్రంగా అమానించారు పెళ్లికొడుకు బంధువులు. త‌ప్పుడు స‌మాచారంతో పెళ్లి కొడుకు తరుపు మహిళలు ఆమె వస్త్రాలను తీసేసి శరీరాన్ని తనిఖీలు చేసిన సంఘ‌ట‌న ఇప్పుడు మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆ వధువుకు చర్మ వ్యాధి ఉందని ఆరోపణలు రావడమే ఈ పరిణామానికి దారి తీసింది.
ఈసంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది. జై హింద్‌ అనే వ్యక్తికి తీజా అనే యువతికి వివాహం నిశ్చయించారు. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి పెళ్లికూతురు ల్యుకోడర్మా అనే చర్మ వ్యాధితో బాధపడుతుందని, ఆ విషయాన్ని పెళ్లి కొడుకు కుటుంబానికి చెప్పకుండా దాచారంటూ వదంతులు వ్యాపించాయి.ఈ విష‌యంల‌పై పెళ్లికొడుకు బంధువులు ర‌చ్చ‌ర‌చ్చ‌చేశారు.దాదాపు పెళ్లి ఆగిపోయింద‌నుకున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

పెళ్లి కూతురు తండ్రి పోలీసులకు పిర్యాదు చేయ‌డంతో ఇరు వర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడే ఓ స్టేషన్‌ గదిలోకి అబ్బాయి తరుపు మహిళలు కొందరిని పంపించి అక్కడే పెళ్లి కూతురు వస్త్రాలు తీయించి తనఖీలు చేయించారు. తర్వాత అలాంటి చర్మ వ్యాధి ఏదీ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కించారు. ఈ సందర్భంగా వరుడు వధువుకు క్షమాపణలు చెప్పాడు. అయితే, అప్పటికే ఆ అమ్మాయికి ఎంత అవమానం జరగాలో అంత జరిగింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -