అనుమానంతో పెళ్లిపీటల మీద కూర్చుంటున్న సంయంలో పెళ్లికూతురిని తీవ్రంగా అమానించారు పెళ్లికొడుకు బంధువులు. తప్పుడు సమాచారంతో పెళ్లి కొడుకు తరుపు మహిళలు ఆమె వస్త్రాలను తీసేసి శరీరాన్ని తనిఖీలు చేసిన సంఘటన ఇప్పుడు మీడియాలో వైరల్గా మారింది.
ఆ వధువుకు చర్మ వ్యాధి ఉందని ఆరోపణలు రావడమే ఈ పరిణామానికి దారి తీసింది.
ఈసంఘటన ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది. జై హింద్ అనే వ్యక్తికి తీజా అనే యువతికి వివాహం నిశ్చయించారు. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి పెళ్లికూతురు ల్యుకోడర్మా అనే చర్మ వ్యాధితో బాధపడుతుందని, ఆ విషయాన్ని పెళ్లి కొడుకు కుటుంబానికి చెప్పకుండా దాచారంటూ వదంతులు వ్యాపించాయి.ఈ విషయంలపై పెళ్లికొడుకు బంధువులు రచ్చరచ్చచేశారు.దాదాపు పెళ్లి ఆగిపోయిందనుకున్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
పెళ్లి కూతురు తండ్రి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఇరు వర్గాలను స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడే ఓ స్టేషన్ గదిలోకి అబ్బాయి తరుపు మహిళలు కొందరిని పంపించి అక్కడే పెళ్లి కూతురు వస్త్రాలు తీయించి తనఖీలు చేయించారు. తర్వాత అలాంటి చర్మ వ్యాధి ఏదీ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కించారు. ఈ సందర్భంగా వరుడు వధువుకు క్షమాపణలు చెప్పాడు. అయితే, అప్పటికే ఆ అమ్మాయికి ఎంత అవమానం జరగాలో అంత జరిగింది.
{loadmodule mod_sp_social,Follow Us}