Saturday, April 27, 2024
- Advertisement -

యూపీలో మరో దారుణం.. మహిళను బంధించి..

- Advertisement -

దేశంలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు, దాడులు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎదో ఒక చోట మ‌హిళ‌లై నేరాలు చోటుచేసుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌పై జ‌రుగుతున్న నేరాల‌కు అడ్డ‌గా మారింది. ఈ నేప‌థ్యంలో మ‌రో దారుణం చోటుచేసుకుంది. ఓ మ‌హిళ‌ను బంధించిన ఓ దుండ‌గుడు నాలుగు రోజులుగా బాధితురాలిపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు.

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. రాష్ట్రంలోని బాందా జిల్లా గిర్వాన్ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళ‌ను.. త‌మ ఇంటివ‌ద్ద ప‌ని ఉంద‌ని చెప్పి.. మోబిన్ (30) అనే వ్య‌క్తి త‌న వెంట తీసుకెళ్లాడు. అక్క‌డే ఆమెను బంధించి నాలుగు రోజుల‌పాటు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. చివ‌రికి నిందితుడి చెర నుంచి త‌ప్పించుకున్న బాధితురాలు నేరుగా ఇంటికి వెళ్లి జ‌రిగిన దారుణం గురించి కుటుంబ సభ్యుల‌కు తెలిపింది.

దీంతో బాధితురాలి కుటుంబ స‌భ్యులు స్థానికంగా ఉన్న పోలీసు స్టేష‌న్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. అలాగే, నిందితుడిని సైతం అదుపులోకి తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. బాధిత మ‌హిళ‌ను వైద్య ప‌రీక్ష‌ల కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రి నివేదిక అధారంగా ద‌ర్యాప్తు కొన‌సాగిస్తామ‌ని పోలీసులు వివరించారు. కాగా, దేశంలో అత్య‌ధికంగా మహిళ‌ల‌పై నేరాలు యూపీలోనే జ‌రుగుతున్నాయ‌ని ఇటీవ‌ల ప‌లు రిపోర్టులు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ.. ప్ర‌తిపాదించిన జ‌స్టిస్ బోబ్డే

ఈ పెయింటింగ్ ఖ‌రీదు రూ.450 కోట్లు !

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. ఓట‌ర్ల దుస్తులు ఉతికిన అభ్యర్థి

రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐదుగురు జవాన్ల మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -