తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు జోరందుకుంది. ఎన్నికల బరిలో నిలిచిన ఆయా పార్టీలు నువ్వా నేనా అనే విధంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల పోరులో నిలిచిన పలు పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అభ్యర్థి ఓటర్ల బట్టలు ఉతకడం సంచలనంగా మారింది.
వివరాల్లోకెళ్తే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) అభ్యర్థి తంగ కతిరవ ఓటర్ల బట్టలను ఉతికాడు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ఉచితంగా వాషింగ్ మెషన్లు అందిస్తామని పలు రకాల హామీలను గుప్పించారు. సోమవారం కాన్వాసింగ్లో ప్రచారం చేస్తుండగా.. అక్కడ ఓ మహిళ తన కుటుంబ సభ్యుల దుస్తులు ఉతుకుతోంది.
ఈ క్రమంలోనే అక్కడికి చేరిన తంగ కతిరవ ఆమె వద్దకు చేరాడు. ఆ తర్వాత ఆయన కూర్చుని బట్టలు ఉతకడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), పాతాలి మక్కల్ కట్చి (పీఎంకె)లు పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి. ఎన్నికలు వచ్చే నెల 6న ఒకే విడతలో జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐదుగురు జవాన్ల మృతి
తెలంగాణలో కరోనా పంజా.. రేవంత్ రెడ్డికి పాజిటివ్ !
మెగాస్టార్ దూకుడు.. సోనాక్షితో రోమాన్స్ !