ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడా పోషకాలు లభించాలి. మెరుగైన ఆహారం తీసుకోవాలి. దీనిని అందరూ ఇచ్చే సలహా పండ్లు తినాలని. అవును నిజమే పండ్లల్లో ఉండే అధిక పోషకాలు, విటమిన్లు శరీరానిని ఎంతో మేలు చేస్తాయి. మనల్ని అనారగ్యం దరిచేరకుండా ఆదుకుంటాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుతం పండ్ల ద్వారా కూడా వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
అలాంటి పండ్లు శరీరానిని చెడు చేస్తున్నాయి. ఆ పండ్లను మీరు గనక తిన్నారో మీ పని అంతే ! ఆ పండ్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ! ప్రస్తుతం మనకు మార్కెట్ లో లభించే మూడు రకాల పండ్లకు రెగ్యులర్గా పురుగుమందులు స్ప్రే చేస్తారు. వీటి విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా పురుగుమందులు కొట్టే పండు ద్రాక్ష. అది నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష అని తేడాలేకుండా ప్రతిరోజు స్ప్రే చేస్తారు.
రెండోది దానిమ్మ పండు. వీటికి కూడా రెగ్యులర్గా స్ప్రే చేస్తారు. ఎందుకంటే కాయ లోపల పురుగు పుట్టే గుణం ఉంటే కాయ మొత్తం కుళ్లిపోతుంది. ఆ తర్వాత మూడో పండు యాపిల్.. వీటికి కూడా పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా వాడాలి లేదంటే తొందరగా డ్యామేజ్ అవుతుంటాయి. మెరుస్తూ కనిపించడానికి కూడా పురుగుల మందులు స్ప్రే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మూడు రకాల పండ్లు మందులు వాడకుండా పండించేవి కూడా మార్కెట్ లో ఉంటున్నాయి. కాస్తా ధర ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు.
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ.. ప్రతిపాదించిన జస్టిస్ బోబ్డే
ఈ పెయింటింగ్ ఖరీదు రూ.450 కోట్లు !
తమిళనాడు ఎన్నికలు.. ఓటర్ల దుస్తులు ఉతికిన అభ్యర్థి