Thursday, May 9, 2024
- Advertisement -

రోజాకు పోటీ ఇవ్వ‌గ‌లుగుతుందా…?

- Advertisement -

టీడీపీకి సినీగ్లామ‌ర్ మ‌రింత పెరిగింది. అల‌నాటి హీరోయిన్ వాణివిశ్వ‌నాథ్ టీడీపీ తీర్థం పుచ్చుకోవ‌డం తేలిపోయింది. దీనికి కార‌ణం వైసీపీ ఎమ్మెల్యే రోజా ను ఎదుర్కోవ‌డంలో ప‌చ్చ‌పార్టీ నాయ‌కులు ఆప‌సోపాలు ప‌డుతున్నారు. అందుకె సినీ గ్లామ‌ర్‌ను ..సినీ గ్లామ‌ర్‌తోనె ఎదుర్కోవాల‌ని బాబు టీడీపీలోకి ఆహ్వానించారు. క‌నీస రాజ‌కీయ అనుభ‌వంలేని వాణి శిశ్వ‌నాథ్ అప్పుడే రాజ‌కీయాల‌ను వంట‌ప‌ట్టించుకున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాకి ధీటుగా ‘గ్లామరస్‌’ ఇమేజ్‌ వుంది గనుక, వాణి విశ్వనాథ్‌ని వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. చంద్ర‌బాబు ఆదేశిస్తె న‌గ‌ర‌నుంచి రోజాపై పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

రాజకీయాల్లో వాణి విశ్వనాథ్‌తో పోల్చితే, రోజాకి సీనియార్టీ చాలా ఎక్కువ. మొద‌ట తెలుగుదేశంలో చేరిన రోజా త‌ర్వాత ఆపార్టీ రాష్ట్ర మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలిగా చేసిన అనుభం ఉంది. ప్రత్యర్థుల్ని పదునైన ‘మాటలతో’ ఇరకాటంలో పెట్టడం రోజా సొంతం. అలాంటి రోజాతో వాణివిశ్వ‌నాథ్ రాజ‌కీయంగా పోటీ ప‌డ‌టం ప‌క్క‌న ప‌డితె ….అస‌లు రోజాతో పోల్చుకోవ‌డ‌మే ఇబ్బందిక‌రంగా అనిపించ‌వ‌చ్చు.

ఎటూ చూసినా రోజాతో పోల్చితో రాజ‌కీయాల్లో రానించ‌డం అంతఈజీ కాదు. వాణి విశ్వనాథ్‌ బాడీ లాంగ్వేజ్‌ చూస్తే మాత్రం, ‘ఈ రాజకీయం నాకో లెక్కా.?’ అన్నట్లుగానే ఆమె వుందనిపిస్తోంది. ఒక్క రోజా కాదు, పది మంది రోజాలు వచ్చినా ఎదుర్కొనే సత్తా నాకుంది..’ అని వాణి విశ్వనాథ్‌ చెప్పడమంటే, ఇది ఖచ్చితంగా ఓవర్‌ కాన్ఫిడెన్స్ కాక మ‌రేమిటి. మున్ముందు చూడాలి రోజాకు వాణి విశ్వ‌నాథ్ ఎంత ధీటుగా స‌మాధాన మిస్తుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -