బ్యాంకులకు రూ.9000 కోట్లు కుచ్చుటోపి పెట్టి లండన్ పారిపోయిన లిక్కర్ రాజు విజయ్ మాల్యా మూడో పెళ్లికి సిద్ధమయ్యారు. కొంత కాలంగా పింకీ లాల్వానీతో డేటింగ్లో ఉన్న మాల్యా త్వరలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
పరిచయమైంది. ఆమెకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఉద్యోగం ఇప్పించాడు. ఆ తర్వాత ఆమెతో డేటింగ్ చేస్తూ మాల్యా కొంత కాలంగా సహ జీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లండన్లో ఉంటున్న మాల్యాకు తోడుగా పింకీ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. కోర్పు తీర్పులకు కూడా మాల్యాతో పాటు ఆమె కలిసి వెళుతోందట.
తొలుత మాజీ ఎయిర్ హోస్టెస్ సమీరా త్యాబ్జీని విజయ్ మాల్యా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి సంతానమే సిద్ధార్థ్ మాల్యా. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు రేఖను పెళ్లాడాడు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతున్నారు.