Friday, May 24, 2024
- Advertisement -

కుమార్తెను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

- Advertisement -

ఆ ప్రాంతంలో తీవ్ర వర్షాలు.. ఎవరు కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అయిన ఓ తండ్రి తన కుమార్తెను కాపాడుకునేందుకు ఎవరు చేయని సాహసం చేశాడు. అసలు విషయంలోకి వెళ్తే… నాలుగు రోజులగా ఆ కుమార్తెకు చాలా జ్వరం.. అయితే చికిత్స కోసం వెళ్లాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద కాలువ దాటాల్సి ఉంది. అయితే ఆ కాలువ ఇటివలే వచ్చిన వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఎలాగైనా తన ఏడాది కుమార్తెను కాపాడుకోవాలి అని ఆ తండ్రి ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ కాలువను ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గ బాహుబలి సినిమాలో చిత్రంలో రమ్యకృష్ణ పసికందును చేతితో పైకెత్తి ప్రవాహానికి ఎదురునిలిచిన గుర్తుకు తెచ్చే ఈ సంఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం కుడుముసారిలో మంగళవారం చోటు చేసుకుంది. కుడుముసారి గ్రామానికి చెందిన పాంగి సత్తిబాబు ఏడాది కుమార్తెకు నాలుగు రోజులు అయిన జ్వరం తగ్గకపోవడంతో ఆ జ్వరం మరింత ఎక్కువైయింది.

కుమార్తెను చికిత్స కోసం తీసుకెళ్దామంటే బయట జోరుగా వర్షం. ఆ ప్రాంతంలో ఉన్న కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. బంధువులంతా వద్దన్నా కుమార్తెకు కాపాడుకునేందుకు కాలువ దాటడానికే సత్తిబాబు సిద్ధమయ్యాడు. పసికందును చేతుల పెకైత్తుకొని చాలా కష్టంగా కాలువ దాటాడు. తర్వాత సుమారు 5 కిలోమీటర్ల మేర నడిచి మెయిన్‌రోడ్‌కు చేరుకొని లోతుగెడ్డ పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. చిన్నారికి చికిత్స చేసిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.

Related

  1. రుద్రాక్షలో రమ్యకృష్ణ!
  2. రాజమౌళి కి దిమ్మతిరిగే లాగా చేసిన రమ్య కృష్ణ
  3. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  4. ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -