Wednesday, May 22, 2024
- Advertisement -

రాజమౌళి కి దిమ్మతిరిగే లాగా చేసిన రమ్య కృష్ణ

- Advertisement -

బాహుబలి సినిమాతో రాజమౌళి భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడిగా చేరిపోయాడన్నది అందరికి తెలిసిన విషయమే. తీసిన అన్ని సినిమాలను హిట్ బాట పట్టిన రాజమౌళి తనకు మాత్రమే సాధ్యమైన ట్రాక్ రికార్డ్ ని చూసి అందరు అవాక్కవ్వాల్సిందే. అయితే ప్రస్తుతం రాజమౌళి బాహుబలి కంక్లూజన్ షూటింగ్ బిజీలో ఉన్నాడు.

రీసెంట్ గా కంక్లూజన్ షూటింగ్ స్టార్ట్ చేశాడు రాజమౌళి. అయితే అంతా సక్రమంగా జరుగుతుంది అనుకుంటున్న టైంలో రాజమత శివగామి అదేనండి రమ్యకృష్ణ ఊహించని షాక్ ఇచ్చిందట.మొదటి పార్ట్ లో అందరి పాత్రలతో పాటు రాజమాత క్యారక్టర్ కూడా ఆడియెన్స్ కి బాగా ఎక్కింది. శివగామిగా రమ్యకృష్ణ మంచి ప్రసంశలను అందుకుంది.

అయితే సెకండ్ పార్ట్ లో కూడా ఆమె పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ కారణాల మీద తనకు సెకండ్ పార్ట్ కి రెమ్యునరేషన్ పెంచాల్సిందిగా రాజమౌలి దగ్గర ప్రస్థావించిందట రమ్యకృష్ణ. సినిమా రెండు భాగాలకు కలుపుకుని ముందే అగ్రిమెంట్ చేయించుకున్నాకా ఇప్పుడు మధ్యలో రెమ్యునరేషన్ పెంచమంటే ఎలా అని అన్నాడట రాజమౌళి.

కాని రమ్యకృష్ణ మాత్రం రెమ్యునరేషన్ పెంచితేనే కాని సెకండ్ పార్ట్ లో తను చేస్తానని ఖరాఖండిగా చెప్పేసిందట. ప్రస్తుతం రమ్యకృష్ణ ఇచ్చిన ఈ షాక్ కి రాజమౌళికి ఏం చేయాలో తోచని పరిస్థితి అయ్యిందట. ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా వారితో మాట్లాడి రమ్యకృష్ణకి ఎంతో కొంత రెమ్యునరేషన్ పెంచుతారో లేదా ఆమెకు సర్ధిచెబుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -