Wednesday, May 8, 2024
- Advertisement -

విశాఖ మన్యంలో దారుణం…గిరిజన యువతిపై అత్యాచారం,హత్య

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖమణ్యంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గిరిజన యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసి ఆతర్వాత హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెల్తే అరకు ప్రాంతంలోని చినలబుడు గ్రామానికి చెందిన కిల్లో పుష్ఫ అనే గిరిజన యువతి స్థానికంగా మీసేవా కేంద్రంలో పనిచేస్తోంది.

అదే ప్రాంతానికి చెందిన మహేష్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.భార్య, ఇద్దరు బిడ్డలున్న మహేశ్ రెండో పెళ్లి చేసుకుంటానని వేధిస్తుండగా ఆమె నిరాకరిస్తూ వస్తోంది. ఇదే విషయమై మాట్లాడుకుందామని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెల్లి మరో సారి పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె నిరాకరించిది.

దీంతో ఆగ్రహానికి గురైన మహేశ్ ఆమె కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తుందనె అనుమానంతో బండరాయితో తలపై మోది హత్యచేసిన అనంతరం అరకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ విషయం తెలియడంతో గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అదుపులో ఉన్న నిందితున్ని తమకు అప్పగించాలని పోటీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్టేషన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -