ప్రస్తుతం మార్కెట్లో మొబైల్ కంపెనీలు తమ కొత్త ఫోన్లతో దూసుకపోతున్నారు. అద్భుత ఫీచర్లతో రోజుకొక కొత్త స్మార్ట్ మొబైల్స్ వస్తున్నాయి. తాజాగా మొబైల్ దిగ్గజం వివో అద్భుతమైన ఫీచర్లతో నూతన స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. వివో వై95 పేరుతో మిడ్ రేంజ్ ఫోన్ను భారతీయమార్కెట్లో లాంచ్ చేసింది.వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, డ్యూయెల్ కెమెరాలు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ ధర రూ.16,990గా ఉంది. స్టర్రీ బ్లాక్, నెబులా పర్పుల్ కలర్లలో లభించే ఈ ఫోన్ ఆఫ్ లైన్ స్టోర్లతో పాటు ఫ్లిప్ కార్ట్, అమెజాన్, పేటీఎం, వివో ఇండియా ఇ-స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. పేటీఎం ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.1,500 క్యాష్ బ్యాక్ లభించనుంది. దీంతో పాటు జియో వినియోగదారులు రూ.4వేల, 3టీబీ డేటా ఉచితం లాంటి ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.
వివో వై95 ప్రత్యేకతలు…
6.2″ హెచ్డీ డిస్ప్లే (1520 x 720 పిక్సల్స్)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
13/2 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
4030 ఎంఏహెచ్ బ్యాటరీ