Tuesday, May 7, 2024
- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తి కాగానే పవన్ చేయబోయే పనేంటంటే…!

- Advertisement -

సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాను శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పట్టాలెక్కడానికి చాలా సమయం తీసుకొన్న

ఈ సినిమా ను తొందరగా పూర్తి చేసి… మరో పనిలో పడిపోవాలని పవన్ భావిస్తున్నాడు. మరి ఈసినిమా పూర్తి కాగానే పవన్ మరో సినిమాపై దృష్టి సారిచడం లేదు.. ఆయన పొలిటికల్ కెరీర్ గురించి కాన్సన్ ట్రేట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.

రెండు నెలల్లోగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేయించి జీహెచ్ ఎంసీ ఎన్నికల మీద దృష్టి నిలపాలని పవన్ భావిస్తున్నాడని సమాచారం. గత కొంతకాలంగాప వన్ పొలిటికల్ యాక్టివిటీస్ తగ్గాయి. ఏపీ రాజధాని ప్రాంత రైతులను పరామర్శించి… ట్విటర్ ద్వారా రాజకీయాలను కొనసాగించి.. పవన్ వాటికి బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన పొలిటికల్ యాక్టివిటీస్ కు కొంత దూరంగా ఉన్నాడు. ఆ దూరం సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తయ్యేంతవరకేనని తెలుస్తోంది. అది కాస్తాపూర్తయ్యాకా ఆయన జనసేన పనుల మీద దృష్టి సారించనున్నాడు.

సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయిన సమయంలోనే పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత జనసేన అధినేత రాజకీయాలను తగ్గించాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే జీహెచ్ ఎంసీ ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం జీహెచ్ ఎంసీ అధికారులు డివిజన్ల పునర్విభజన పనిలో ఉన్నారు. అవి పూర్తి అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలపై కొంత క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో అంతలోపు పవన్ కూడా సినిమా పనులను పూర్తి చేసుకొని.. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తనదైన పాత్రను పోషించడానికి ముందుకు రానున్నాడు! మరి పవన్ ఎంట్రీ ఎలా ఉంటుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -