Tuesday, May 21, 2024
- Advertisement -

ప్రిన్స్ కు ఐపిఎల్ పెట్టేంత సీనుందా….?

- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు గురించి గత కొన్నిరోజులుగా ఓ కార్పొరేట్ రేంజ్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.దాని సారాంశం ఏంటంటే… బాబుగారు పెద్ద మనసుతో వైజాగ్ నుంచి ఓ ఐపిఎల్ టీం ను రంగంలోకి దించుతున్నారట.

దీనికోసమని ఈయన బావ గల్లా జయదేవ్ అన్ని రకాల సేవలు అందిస్తున్నాడు. దీనికి వైజాగ్ సిక్సర్స్ అనే పేరును వారు సూచించినట్లు చెబుతున్నారు.కాని ఇందుల్లో ఎలాంటి వాస్తవం లేదు.ఎందుకంటే 

ఓ ఐపిఎల్ టీం ను పెట్టాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. వందలకోట్లు దీనికోసమని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పట్లో పెట్టిన కొత్తలోనే ఒక్కొక్క టీంకు 400 కోట్ల వరకూ ఖర్చు అయింది. అది ఇపుడు వేయి కోట్లకు మించి ఉంటుందనేది కొందరివాదన. 

అలా మొండిగా పెట్టి సైడైపోయిన వారిలో  కొచ్చి టస్కర్స్ , పూణె వారియర్స్  ఉన్నాయి.ఒక వేల మహేష్ బావ జయదేవ్ తో కలిసి పెట్టాలనుకున్నప్పటికీ వారికి కచ్చితంగా చాముండి సపోర్ట్ కావాలి.

ఇప్పటికే చాముండి నాగార్చున, రఘురామకృష్ణం రాజులతో ఎంతో క్లోజ్ గాఉంటాడు. ఒక వేల పెడితే వీరిలో కలిసి ఏమైనా చేస్తాడేమో గాని మహేష్ కు ఎంత వరకు సపోర్ట్ చేస్తాడనేది చెప్పలేం. గతంలోనే రఘురామకృష్ణం రాజు ఇదే ఆలోచనలో గోకరాజు మీద పంతం కొద్దీ కోస్తల్ కింగ్స్ అనే పేరుతో ఓ టీం ను షురూ చేద్దామనుకున్నాడు. కాని చాముండి మనకు వర్కవుట్ కాదని చెప్పడంతో లాస్ట్ మినిట్లో డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -