Wednesday, April 24, 2024
- Advertisement -

పరిమిత సంఖ్యతో…గణతంత్ర పరేడ్ వేడుకలు..!

- Advertisement -

కరోనా వ్యాప్తి కారణంగా 2021 గణతంత్ర పరేడ్ వేడుకలు నిరాడంబరంగానే జరగనున్నాయి. కొత్త కరోనా వైరస్​ ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో.. పరిమిత సంఖ్యలో సందర్శకులను అనుమతించనున్నారు. కొవిడ్​ మార్గదర్శకాలను పాటిస్తూ.. కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కొవిడ్​-19 విజృంభణ నేపథ్యంలో.. ఎర్రకోటలో ఈ ఏడాది ఆగస్టు-15 వేడుకలు కూడా సాధారణంగానే జరిగాయి.

రిపబ్లిక్​ డే(జనవరి-26)కు కొద్దిరోజులే మిగిలి ఉన్నందున.. ఢిల్లీ లో చల్లటి వాతావరణంలోనే కవాతు కోసం రిహార్సల్స్​ చేస్తున్నారు సైనికులు.భారత 72వ గణతంత్ర వేడుకలకు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​ పేర్కొన్నారు. ఫలితంగా భారత్​-యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -