తన మాజీ భార్య పట్ల…మాజీ భర్త దారుణంగా వ్యవహిరించాడు.. స్నేహితులతో కలిసి గ్యాంగ్రేప్కు పాల్పడటంతో పాటు హింసించడంతో ఆమె మరణించింది. విడాకులు తీసుకున్న తర్వాత భార్య ఆనందంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయిన మాజీ భర్త స్నేహితులతో కలసి ఈ దారుణానికి వడిగట్టారు. జార్ఖండ్ లోని నారాయణపుర ప్రాంతంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికంగా ఉంటున్న ఓ యువతి(23)కి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో కొన్నిరోజుల క్రితం వివాహమైంది. అయితే ఇద్దరికి పొసగకపోవడంతో విడాకులు తీసుకున్నారు. భార్య ఆనందంగా ఉండటాన్ని సహించలేకపోయిన మాజీ భర్త కుట్ర పన్నాడు.
నారాయణపుర లో ఉన్న ఓ థియేటర్ లో సినిమా చూడటానికి యువతి వెళ్లడాన్ని గమనించిన ఆమె భర్త పగతో రగిలిపోయాడు. తనను వదిలేసి సంతోషంగా ఉన్న ఆమెపై కసి తీర్చుకోవాలని భావించి మాజీ భార్యను అనుసరించాడు. సాయం కోసం ఇద్దరు స్నేహితులను పిలిపించాడు.
సినిమా ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. మార్గమాధ్యంలో మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఆమెను అడ్డగించాడు. అనంతరం మాజీ భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి… ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.అక్కడితో ఆగకుండా ఆమె పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు.. మాజీ భార్య అన్న కనికరం లేకుండా ఆమె ప్రైవేట్ భాగాల్లోకి కర్రను చొప్పించి.. చిత్రహింసలకు గురిచేసి అక్కడి నుంచి పారిపోయారు.
అయితే మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన బాధితురాలు బాధ తాళలేక రోదించడంతో అటుగా వెళుతున్న ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే చిత్రహింసల కారణంగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చనిపోయొ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మాజీ భర్త, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.